రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఛార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఛార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్

ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును యూటర్న్ చేస్తూ రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీ కొట్టింది. దాంతో బైక్‌పై వస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక మృతి చెందిన వ్యక్తిని చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సాధిక్‌ అలీగా గుర్తించారు. ప్రమాదంలో గాయలైన వ్యక్తి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఖాజావలి మొహినుద్దీన్‌ అని తెలిపారు పోలీసులు.

ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లి మలక్‌పేట్‌లోని క్వార్టర్స్‌కు వెళుతుండడగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయారు.. ఆ కారుపై స్పీడ్ డ్రైవింగ్ చేసినట్లు పెండింగ్ చలానాలు ఉన్నట్లు గుర్తించారు. సీఐ సాధిక్ అలీ రెండు రోజుల క్రితం మెదక్‌కు బదిలీ అయినట్లు తెలుస్తోంది.. కారుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.