యువత దేశం కోసం కృషి చేయాలి

యువత దేశం కోసం కృషి చేయాలి
  • జిల్లా స్థాయి యువజన వారోత్సవాల్లో కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:యువత దేశం కోసం కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. స్వామీ వివేకానంద జయంతి నేపథ్యంలో యువజన వారోత్సవాల్లో భాగంగా  వైస్రాయ్ గార్డెన్ లో శుక్రవారం జిల్లా స్థాయి యువజన వారోత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశం చాల పెద్ద దేశం, భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలను, బాషలను యువత గౌరవించాలన్నారు.మాతృ భూమిపైన గౌరవం, ప్రేమను కల్గి ఉండాలన్నారు.యువత శక్తి గొప్పది, యువత ఎన్నో బాధ్యతలను కల్గి ఉండాలన్నారు. మెదక్ జిల్లాలో యువత అసెంబ్లీ ఎన్నికలలో చాలా మంది నూతన ఓటరుగా నమోదు చేసుకొని, ఓటుహక్కు వినియోగించి రాష్ట్రలో జిల్లాకు ద్వితీయ స్థానం దక్కిందన్నారు.యువత సన్మార్గంలో పయనించాలన్నారు.యువత ప్రాథమిక విద్య నుంచే బేసిక్స్ మీద పట్టు సాధించాలని,ప్రాథమిక స్థాయి నుంచే  విజ్ఞన నిర్మాణంలో  శ్రాస్త్రాల మీద పట్టు సాధించి ఉన్నత స్థాయిలో యూపిఎస్సి, గ్రూపు-1, గ్రూపు-2 లాంటి ఉన్నత ఉద్యోగాలను సాధించి కన్న తల్లి తండ్రుల యొక్క గౌరవాన్ని పెంచాలన్నారు.ఉన్నతమైన భవిషత్ కోసం కలలు కనాలన్నారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా పాఠశాల  స్థాయిలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో బాగంగా ప్రాథమిక విద్యలో తొలిమెట్టు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్నతి, 10వ తరగతి లక్ష్య లాంటి ఎన్నో నూతన విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఈ కార్యక్రమాలను ఉపయోగించి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.పరీక్షల సమయం  దగ్గర పడుతున్నందున సెల్ ఫోన్లు, యూట్యూబ్, సోషల్ మీడియా లాంటి వాటి మీద సమయం వృధా చేసుకోవొద్దని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్, లిక్కర్ లాంటి వాటిని సమూలంగా నిర్మూలిస్తుoదన్నారు. డ్రగ్స్, లిక్కర్ జోలికి పోకుండా యువత సన్మార్గంలో ప్రయాణించి, బంగారు భవష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన,  క్రీడల అధికారి నాగరాజు, జిల్లా ఇంటర్ విద్య అధికారి సత్యనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.