కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయ మాటలు నమ్మొద్దు

కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయ మాటలు నమ్మొద్దు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది
  • వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే  మెతుకు ఆనంద్ ఎన్నికల ప్రచారం 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే  మెతుకు ఆనంద్ శని వారం వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిమ్మాపూర్, రావులపల్లి, కుడుగుంట , పెద్దాపూర్., గుర్రంగట్టు తండాలలో ప్రచారం నిర్వించి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. వికారాబాద్ పట్టణంలో కేసీఆర్ ప్రభుత్వం 150 పడకల ఆసుపత్రి తో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే రైల్వే ట్రాక్ పై కొత్త గా వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. గత పాలకులు కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా తీసుకు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మ వద్దని కోరారు. పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. రైతులు, మహిళల సక్షేమం కోసం కొత్తగా పథకాలు అమలు చేయనుందని తెలిపారు.