రేపు మెదక్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన

రేపు మెదక్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక,ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు.హరీష్ రావు ఈనెల 5న బుధవారం  పర్యటించనున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు రామాయంపేట పట్టణంలో డా.బాబు జగ్జీవన్ రామ్ గారి  జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలు  అందజేయనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు హవేళి ఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి శ్రీనివాస గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొంటారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శంకరంపేట( ఆర్ )మండలం టీ. మందాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ధరణి పాస్ బుక్స్ అందజేయనున్నారు. అక్కడినుండి నూతన కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మెదక్ పట్టణం సాయి బాలాజీ గార్డెన్ లో జిల్లాస్థాయిలో ఎంపికైన 27 గ్రామపంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులను అందజేయనున్నారు. సాయంత్రం 5:00 గంటలకు మెదక్ జిల్లా ఆసుపత్రి నందు రేడియాలజీ ల్యాబ్ ను ప్రారంభిస్తారు.  టీఎన్జీవో భవన్ లో కమ్యూనిటీ సంఘాలకు ప్రొసీడింగ్స్ అందజేస్తారు. సాయంత్రం 6:30 నిమిషాలకు మెదక్ షాదిఖానలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.