ఘనంగా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి
లీజు పునరుద్ధరణకు సహకరించిన సీఎం రేవంత్కు పలువురి కృతజ్ఞతలు
హైదరాబాద్, ముద్ర: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతి సందర్భంగా కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ లో చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పలువురు సీపీఐ నాయకులు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి, అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నంనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి చెన్నకేశవరావు, ఏఐటీయూసీ మాజీ జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి, మహిళా సంక్షేమకేంద్రం డైరెక్టర్ కృష్ణకుమారి , వృద్ధాశ్రమం సలహా కమిటీ సభ్యులు డాక్టర్ సరస్వతి, రాజేందర్ రావు, మేనేజర్ శ్రీనివాస్, వృద్ధాశ్రమవాసులు తదితరులు పాల్గొన్నారు.
చండ్ర రాజేశ్వరావు ఫౌండేషన్ చారిటబుల్ సంస్థ లీజును పునరుద్దరించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరవాధ్యక్షుడు సురవరం సుధాకరెడ్డి, అధ్యక్షుడు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా లీజు పునరుద్ధరణకు గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వారు చెప్పారు.