విద్యార్థుల మధ్య ఘర్షణ పేరెంట్స్ ధర్నా ఎస్ ఐ హామీతో విరమణ

విద్యార్థుల మధ్య ఘర్షణ పేరెంట్స్ ధర్నా ఎస్ ఐ హామీతో విరమణ

 ముద్ర,రాయికల్ :- రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఓ తరగతులకు ఇంచార్జ్ గా మరో తరగతి విద్యార్థులకు ఇవ్వడంతో వారు ఇంచార్జ్ గా ఉన్న క్రింది స్థాయి తరగతి విద్యార్థులపై దాడి చెయ్యగా తల్లిదండ్రులు రోడ్డు మీద ధర్నా చేశారు.నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో గురుకుల పాఠశాల సిబ్బంది వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం వహించడంతో మంగళవారం రోజు ఉగాది సెలువు కావడంతో విద్యార్థుల సందర్శనకు వచ్చిన పేరెంట్స్ చూసి పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నానిర్వహించారు.

విద్యార్థులకు బోధించడం చేతకాకపోతే మానేయాలి కానీ వారికి పై స్థాయి తరగతి విద్యార్థులకు ఎలా ఇంచార్జీ ఇస్తారని,దాడిలో గాయాలైనప్పుడు ఎందుకు వైద్యం చేయించ లేదని,నినాదాలు చేశారు.అక్కడికి చేరుకున్న ఎస్సై అజయ్ సంబంధిత విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, పాఠశాల సిబ్బందితో చర్చించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడంతో ఆందోళన ఆగిపోయింది.