ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి యువకుడి మృతి

ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి యువకుడి మృతి

ముద్ర,రాయికల్ : రాయికల్ పట్టణ కేంద్రానికి చెందిన జిల్లాల సవీన్ అనే యువకుడుకి మానసిక, శారీరక వైకల్యం గల వ్యక్తి గత కొంతకాలంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. ఎప్పటిలాగా ఈనెల 24 ఆదివారం రోజున ఉదయం 10 గంటల ప్రాంతంలో కుమ్మరిపెల్లి శివారులోని చర్చికి వెళ్లి,రాత్రి అయిన తిరిగి రాకపోవడంతో అతని గురించి వెతకగా, అదే రోజు రాత్రి 8:30 కు ఎస్సారెస్పీ కాలువ నీటిలో చనిపోయి కనిపించినాడు.

మృతుడు చర్చికి వెళ్ళిన తర్వాత దానికి దగ్గరలో ఉన్న ఎస్సారెస్పీ కాలువ వద్దకు మల విసర్జన చేయుటకు వెళ్లి,ప్రమాదవశాత్తు కాలుజారి ఎస్సారెస్పీ కాలువ నీటిలో పడి వైకల్యం కారణంగా నీటిలోనే మునిగి చనిపోయినాడనీ, మృతుని అన్న సతీష్ ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అజయ్ తెలిపారు.