తీవ్ర విషాదం - అత్త మృతదేహం వద్ద ప్రాణాలు విడిచిన కోడలు

తీవ్ర విషాదం - అత్త మృతదేహం వద్ద ప్రాణాలు విడిచిన కోడలు

ముద్ర,యాదాద్రి భువనగిరి:- యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అత్త మృతదేహం వద్ద కోడలు ప్రాణాలు విడిచింది. గుండెపోటుతో నేటి ఉదయం అత్త భారతమ్మ మృతి చెందగా.. అత్త మృతదేహం వద్ద రోదిస్తూ కోడలు మంగమ్మ అపస్మారకస్థితిలోకి వెళ్ళింది. ఈ క్రమంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మంగమ్మ మృతి చెందింది.