సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ...ఇక నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తా

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ...ఇక నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తా

ముద్ర,తెలంగాణ:- "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పటి నుంచి తన రాజకీయం ఏంటో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు 'మా ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. నిన్నటిదాకా సీఎంగా నిబద్ధతతో పనిచేశా. ఇక పార్టీ అధ్యక్షునిగా.. నా రాజకీయ రూపం చూస్తారు. సీఎంగా వందవ రోజు ఒక గేట్ ఓపెన్‌ చేశా. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటానా. పెద్దలు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. కొట్టకుండా ఊరుకుంటామా' అని అన్నారు.