మోదీని ఓడించి రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించండి
- తెలంగాణ ప్రజా ఫ్రంట్
ముద్ర ప్రతినిధి భువనగిరి :నరేంద్ర మోదీని ఓడించండి రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించండన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ కాశాపాక మహేశ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జాంగిర్, బట్టు రామచంద్రయ్య, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఆర్.జనార్దన్ లు మాట్లాడుతూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ కల్లబొల్లి మాటలతో సరికొత్త హామీలతో ముస్తాబై ప్రజల ముందుకు వచ్చి మసిబూసి మారెడుగాయ చేసి ఓట్లను కొల్లగొట్టేందుకు వాగ్దానాల్లో పోటీ పడుతున్నాయన్నారు. అధికారం కోసం, ఓట్లు దండుకోవటం కోసం చేసే కుట్రలు, కుహకాల్లో నరేంద్రమోదీ నేతృత్వం లోని బీజేపీ మరో ఆకు ఎక్కువ చదివిందన్నారు. మెజారిటీ వాదంతో సమాజంలో విభజన రేఖలు గీసి మత ఉద్రిక్తతలను పెంచి పోషిస్తు మతాన్ని రాజకీయంతో జోడించి మతరాజకీయం చేస్తు ఓట్ల కోసం మత విశ్వాసాలను, సున్నిత సంస్కృతిక అంశాలను వాడుకుంటుందన్నారు. ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఉప్పలయ్య, సిపిఐఎ ంల్ జిల్లా కార్యదర్శి సుదర్శనాయర్, అమిద్ పాషా, కట్టెల లింగస్వామి, అలీ, మల్లారెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఎం. సతయ్య, డీటీఫ్ జిల్లా అధ్యక్షులు బోయ నర్సింహ్మ, కావలి యాదయ్య, రసా బాలస్వామి, జి.బాలకృష్ణ. సత్తయ్య పాల్గొన్నారు.