చిరువ్యాపారులకు గొడుగుల పంపిణీ

చిరువ్యాపారులకు గొడుగుల పంపిణీ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అద్వర్యంలో పట్టణంలోని పలు వీధులలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎండ, వర్షం నుండి రక్షణగా ఉపయోగపడేలా గొడుగుల పంపిణీ చేశారు. ఈ నెల 24న శ్రీ సత్యసాయి బాబా ఆరాధనా మహోత్సవాన్ని పురస్కరించుకొని చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణి చేసినట్లు సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ తెలిపారు. అయన మాట్లాడుతూ భక్తులందరి సహకారంతో గొడుగుల పంపిణీ సేవతో పాటు , వివిధ దీనజన సేవలు నిర్వహిస్తామని.. 2 నెలల పాటు వేసవి కాలంలో ప్రతిరోజు ఉచితంగా మినరల్ వాటర్ అందించడం జరుగుతుందని, చెప్పులు , తల టోపీలు , బట్టర్ మిల్క్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు తాటిపర్తి దశరథ రెడ్డి , వూటురి శివకుమార్, సామ సునీల్ , గణపతి, నరేందర్ రాజు,మహిళా సభ్యులు బట్టు శ్రీలత, తాటిపర్తి స్వప్న, గుండ అర్చన, జక్కం సరిత, సామ రజిత, కొత్త సుపద పాల్గొన్నారు.