CM KCR Kondagattu నేటి కొండగట్టుకు సీఎం కేసీఆర్ పర్యటన ఈనెల 15 కు వాయిదా ...
![CM KCR Kondagattu నేటి కొండగట్టుకు సీఎం కేసీఆర్ పర్యటన ఈనెల 15 కు వాయిదా ...](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ea2290cab32.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ దర్శన కోసం మంగళవారం రావాల్సిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రోగ్రాం వాయిదా పడినట్లు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. కొండగట్టు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 100 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో యాదాద్రి తరహా కొండగట్టును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా Architecture Anand Sai ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయిని ఆదేశించారు. ఈ మేరకు గత మూడు రోజులుగా ఆనంద్ సాయి కొండగట్టులోని పలు అంశాలను పరిశీలించి అవసరమైన మాడిఫికేషన్లను సీఎం కేసీఆర్ కు నివేదించేందుకు తయారు చేశారు.
సీఎం కేసీఆర్ కొండగట్టుకు వచ్చి అవసరమైన నోటిఫికేషన్లను ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు ఇందులో భాగంగా కొండగట్టుకు రావలసిన సీఎం కేసీఆర్ పర్యటన ఒకరోజు వాయిదా పడింది. దీంతో సీఎం కేసీఆర్ ఈనెల 15న బుధవారం కొండగట్టుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. మంగళవారం కొండగట్టు భక్తుల రద్దీ అధికంగా ఉండడం కారణంగానే సీఎం పర్యటన వాయిదా పడినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం పదవి కోసం జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఎస్పీ భాస్కర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.