జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆకస్మిక తనిఖీ

జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆకస్మిక తనిఖీ

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి జి జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ చే శారు. కళాశాలలోని విద్యార్థుల అడ్మిషన్స్ రిజిస్టర్, హాజర్ పట్టికను పరిశీలించారు.ఈ సందర్భంగా అయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ఉచిత పుస్తకాలను, విశాలమైన తరగతి గదులను విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా ఇంటర్ విద్యాధికారిగా పదోన్నతి పొంది మొట్టమొదటిసారిగా కళాశాలకు విచ్చేసిన ఆయనను కళాశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపల్ ఇల్లందుల సంపత్ కుమార్,జనార్ధన్, గోవర్ధన్ రెడ్డి, రవి, మహేందర్, లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.