వైభవంగా దుబ్బ రాజన్న కళ్యాణం

వైభవంగా దుబ్బ రాజన్న కళ్యాణం

సారంగాపూర్ ముద్ర: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి ఆలయ అర్చకులు వేదమంతుర్చారణ మధ్య కల్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. దుబ్బ రాజన్న జాతర సందర్భంగా మహాశివరాత్రి నుంచి రథోత్సవ0 వరకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సారంగాపూర్ ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి అనూష, ఫౌండర్ ట్రస్టీ పొరండ్ల శంకరయ్య, సారంగాపూర్ తహాల్దార్ గూగుల్,ఉత్సవ సభ్యులు వాసం శ్రీనివాస్,  రామచంద్రారెడ్డి, మానుక గంగావ్వ, ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.