ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
  • చొప్పదండి నియోజకవర్గం లో 2,32,990 ఓటర్లు
  • ఆరు మండలాల్లో 327 పోలింగ్ కేంద్రాలు

ముద్ర ప్రతినిది, చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గం లో నిర్వహించే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రపుల్ దేశాయి తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 327 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పురుషులు 113050, స్త్రీలు 1,19,933, ఇతరులు 7గురు మొత్తం 2,32,990 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అంత సిద్ధం చేసినట్టు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. మండలంలోని రుక్మాపూర్ మహిళా ప్రత్యేక పోలింగ్ కేంద్రం, దేశాయిపేటలో దివ్యాంగుల కోసం ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు లోన్ కాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.