రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి 

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి 

శంకరపట్నం, ముద్ర మే 20: తెలంగాణ రాష్ట్ర చౌక ధరల దుకాణాల జేఏసీ పిలుపుమేరకు శంకరపట్నం మండలం తహసిల్దారు గూడూరి శ్రీనివాసరావుకి తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం గౌరవ వేతనం ప్రభుత్వం అందించాలని వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో జూన్ 5వ తేదీ నాటికి తమ సమస్యలన్నీ పరిష్కరించాలని గౌరవ వేతనం అందించాలని లేనిపక్షంలో సమ్మె చేపడతామని తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ కి రాష్ట్ర జేఏసీ సమ్మె నోటీసును అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొలుగూరి శ్రీనివాస్ , కార్యనిర్వాహక అధ్యక్షులు   పి.పరశురాములు, కోశాదికారి జె .రాజు, బి.రమాదేవిసుధాకర్, యు.సమ్మిరెడ్డి,బి.వేదశ్రీరాజు, వై.శోభాహరీష్ ఎం.మమత తదితర రేషన్ డీలర్లు పాల్గొన్నారు.