గోవాలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. హత్య

గోవాలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. హత్య

పనాజీ : గోవాలో దారుణం జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేశారు. వాస్కో ప్రాంతంలో నిర్మాణం జరుతున్న ఒక ప్రదేశంలో ఆ చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ కేసులో సంబంధం వుందని భావిస్తున్న 20 మందిని పోలీసులు విచారిస్తున్నారు. అపస్మారక స్థితిలో వున్న చిన్నారిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్పీ సునీతా సావంత్ ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, అనంతరం గొంతు పిసికి చంపేసినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఐపీసీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలో నివాసం వుంటున్న 20 మంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.