ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ సిఎం కేసీఆర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సంజయ్ కుమార్ తండ్రి మాకునూరు హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో కెసిఆర్ హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నివాళులు అర్పించారు. అంతకుముందు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఇంటి వద్ద కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు.