జగిత్యాల జిల్లాలో తపాస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు... 

జగిత్యాల జిల్లాలో తపాస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు... 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ గర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన అభ్యర్థి ఎవీఎన్ రెడ్డి గెలుపొందగా  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ అధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించి, స్వీట్స్ పంపిణి చేశారు. తపాస్ జిల్లా అధ్యక్షులు భోనగిరి దేవయ్య, రాష్ట్ర అసోసియేటెడ్ అద్యక్షులు  అయిల్నేని నరేందర్ రావు మాట్లాడుతూ  ప్రభుత్వానికి ఇది గుణపాఠం కావాలని ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సమస్యల సాధనలో ముందున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం  బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం అనేది  ఉపాధ్యాయ లోకానికి శుభ సూచకంగా భావిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ గెలుపు ఉపాధ్యాయ ఉద్యోగ మేధావి వర్గం కలిసికట్టుగా గెలిచిన గెలుపుగా భావించి ప్రభుత్వానికి తొత్తుగా మారిన ఇతర సంఘాలకు ఈ గెలుపు గుణపాఠం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాదరావు, రాష్ట్ర బాధ్యులు రొట్టె శ్రీనివాస్, జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు మహేశ్వర్ శర్మ, జొన్నల పూర్ణచంద్ర, తీగల శ్రీనివాస్, రజనీకాంత్, గంగాధర్ రాజేందర్, రవి . కాశిట్టి రమేష్ కోరుట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు