టెండర్లలో అక్రమాలు ఫై కమిషనర్ కు ఫిర్యాదు

టెండర్లలో అక్రమాలు ఫై కమిషనర్ కు ఫిర్యాదు

ముద్ర, మల్యాల: కొండగట్టులో ఈ నెల 16న నిర్వహించిన టెండర్లలో అక్రమాలు జరిగాయoటూ కూనవేని రాజశేఖర్ అనే వ్యక్తి శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేశాడు. కొండగట్టును సందర్శించిన కమిషనర్ ను కలిసిన అతను టెండర్ల పక్రియలో 50 లక్షల అంజన్న సొమ్ముకు గండి కొట్టారని, అయితే గుత్తే దారులకు ఆలయ అధికారులు సైతం వత్తాసు పలుకడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కంటే తక్కువకే గుత్తేదారులు వ్యాపారాలు దక్కించుకున్నారని, టెండర్ ప్రక్రియ రద్దు చేసి, తనకు అవకాశం ఇస్తే నిబంధనల ప్రకారం అంతకంటే ఎక్కువ ధర  చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు విన్నవించాడు