కెసిఆర్ వారంటీ పీరియడ్ అయిపోయింది

కెసిఆర్ వారంటీ పీరియడ్ అయిపోయింది
  • 9 ఏండ్లలో  కేసిఆర్ చేసిందేమీ లేదు
  • తెలంగాణ లో అధికారం కాంగ్రెస్ దే
  • పురుమల్ల గెలుపు ఖాయం
  • మాజీ కేంద్ర మంత్రి జై రామ్ రమేశ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కెసిఆర్ వారంటీ పీరియడ్ అయిపోయిందని,తొమ్మిది ఏండ్ల పాటు కెసిఆర్ పాలన లో మహిళలు, మైనారిటీ, రైతులకు చేసిందేమీ లేదని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జై రామ్ రమేశ్ అన్నారు. కరీంనగర్ లోని డిసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ప్రజల సమస్యలను గాలికి వదిలేసాడు. అభివృద్ధి అవుటర్ రింగ్ రోడ్డు దాటలేదన్నారు. కరీంనగర్ ను లండన్ చేస్తనన్న కెసిఆర్ మాట మర్చిపోయాడు అన్నారు.  దేశంలో నిరుద్యోగులున్న రాష్ట్రల్లో తెలంగాణ నంబర్ 1లో ఉందని తెలిపారు. తెలంగాణ లో సామాజిక న్యాయం కానరాకుండ ఉందన్నారు. కుటంబ పాలన పై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు కేవలం ఈ నాలుగు కుటుంబ సభ్యుల మధ్య తెలంగాణ పాలన కొనసాగడం దురదృష్టకరం అన్నారు. అభివృద్ది ఎక్కడ లేదన్నారు. అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలో జరిగింది అన్నారు. కాంగ్రెస్ ఆదికారం రావడంతోనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ ఎస్  రెండు ఒక్కటే అని స్పష్టం చేశారు.  రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ అడ్డుకున్నాడని బీజేపీ, బీ ఆర్ ఎస్ కొత్త డ్రామా ఆడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షలు మాఫీ చేస్తామని తెలిపారు.. 2లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి పారదోలాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షులు కోమటిరెడ్డి రెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్,  పిసీసీ అధికార ప్రతినిధి అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.