ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా: మేడిపల్లి సత్యం

ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా: మేడిపల్లి సత్యం

ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా: మేడిపల్లి సత్యం

ముద్ర, మల్యాల చొప్పదండిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. అని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్యాల మండలం కేంద్రములో బ్లాక్ చౌరస్తా నుండి అంగడి బజార్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పర్యాలు ఓడిపోయిన కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రతి వారికి ఆపదలో ఆదుకుంటూ మీ ముందు ఉన్నవాడిని, ఒక్కసారి ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కోరారు.

రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ దీనితో పాటు ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఆసరా పెన్షన్ 4000, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,వంట గ్యాస్ 500, ఆరోగ్యశ్రీ పది లక్షలు, మహిళలకు 2500 ల భృతి ఇస్తామని అన్నారు. రెండుసార్లు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగ ఆనంద రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు, దారం ఆదిరెడ్డి, శోభ రాణి సర్పంచ్ మారంపల్లి సరోజన గంగాధర్, మాజీ సర్పంచులు వెల్మ లక్ష్మారెడ్డి,బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఏడిపెల్లి రాజిరెడ్డి, మరాఠీ గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేరెళ్ల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ అగంతపు రవళి వంశీధర్,ముత్యం శంకర్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచర్ల లక్ష్మణాచారి, అంకం భాస్కర్, వోల్లాల మల్లేశం గౌడ్,సంత ప్రకాష్ రెడ్డి, మర్రి లక్ష్మణ్,ముద్దం శ్రీనివాస్, కనకట్ల జలంధర్,శనిగారపు తిరుపతి, మిల్ట్రీ శ్రీనివాస్, దూడం రామాంజనేయులు, గుర్రం వెంకటేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు.