బడుగు,బలహీన వర్గాలు కాంగ్రెస్ కు మద్దతు పలకాలి..

బడుగు,బలహీన వర్గాలు కాంగ్రెస్ కు మద్దతు పలకాలి..
  • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జడ్పీటీసీ గీకురు రవీందర్

చిగురుమామిడి ముద్ర న్యూస్: గడీల గోడలను బద్దలు కొట్టే సమయం ఆసన్నమైందని.. బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి దొరల పాలన అంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో   ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా దందాలకు ప్రోత్సహించారని, బడా ఆసాములను, భూస్వాములను పెంచి పోషిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్ద దించే తరుణం ఆసన్నమైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలను అనగదొక్కి అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషిచేసిన బిసి బిడ్డ హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు బడుగు, బలహీన వర్గాలు మద్దతు తెలపాలన్నారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి పొన్నం ప్రభాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, బీసీ సెల్ అధ్యక్షులు పొన్నం సంపత్, బీసీ సెల్ మాజీ మండల అధ్యక్షులు కోనేటి రాములు,నాయకులు పెసరి శ్రీనివాస్,గూడెం లక్ష్మి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.