భారీ మెజారిటీతో గెలవబోతున్నా.

భారీ మెజారిటీతో గెలవబోతున్నా.
  • బీజేపీ కార్యకర్తలే నా హీరోలు
  • ఎమ్మార్పీఎస్ కు ధన్యవాదాలు
  • తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించబోతున్నాం
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

        ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ మెజారిటీ స్థానాలు గెలవబోతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అడ్డంకులు సృష్టించిన తట్టుకుని కాషాయ జెండా పట్టుకుని తెగించి కొట్లాడిన కార్యకర్తలే నిజమైన హీరోలని అభివర్ణించారు. కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి అందరికీ స్పూర్తిగా నిలిచేలా చేస్తామన్నారు. పేదల ఇండ్లను కబ్జా చేసేటోళ్లను, భూకబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

        ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు జరిగిన పోలింగ్ సరళిని చూస్తే నాకు పక్కా నమ్మకం ఏర్పడింది. కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నా ఆ నమ్మకం నాకుంది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు నా హీరోలు. ఎన్నికల్లో పూర్తిగా సహకరించిన మంద క్రిష్ణ మాదిగతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలందరినీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా బీజేపీట్ల విశ్వాసం, నరేంద్రమోదీపట్ల నమ్మకంతో ప్రజలంతా ఓటు బ్యాంకుగా మారి ఓటేసిన ఓటర్ మహాశయులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అన్నారు. ఈ సమావేశంలో గుగ్గిల్లపు రమేష్ గండ్ర నలిని సొల్లు అజయ్ వర్మ రమణారెడ్డి, కార్పొరేటర్లు తో పాటు పలువురు పాల్గొన్నారు.