ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు బాగున్నాయి

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు బాగున్నాయి
  • కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం నోడల్ ఆఫీసర్  అబాసాహెబ్ ఆత్మరామ్ కావాలే

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతూ కరీంనగర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం నోడల్ ఆఫీసర్ (డిప్యూటీ సీఈఓ మహారాష్ట్ర) అబాసాహెబ్ ఆత్మరామ్ కావాలే  అన్నారు.కరీంనగర్ లోని ఈవియం గోడౌన్ లో రానున్న ఎన్నికల కొరకు నిర్వహిస్తున్న ఈవియం ఎఫ్.ఎల్.సి., వెబ్ కాస్టింగ్, ఈవియంలను భద్రపరచడం మరియు వెబ్ కాస్టింగ్ గదులను సోమవారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా  కావ్లే మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో వివిధ  రాజకీయ పార్టీల సమక్షంలో చేపడుతున్న ఎఫ్ ఎల్ సి, ఎన్నికల ఏర్పాట్లు ఈసీఐ నిబంధనల ప్రకారం బాగున్నాయని ఆయన తెలిపారు. ఎఫ్.ఎల్.సి నిర్వహణ, ఈవియంలో గోడౌన్ లోకి  ప్రవేశించడం మొదలు కొని ఈవీయం బ్యాలెట్ యూనిట్( బి యు) కంట్రోలింగ్ యూనిట్(సి యు ),వివిపాట్ యంత్రాల మొదటి దశ చెకింగ్ ప్రక్రియ, మాక్ పోల్ నిర్వహణ, ఈవియంలను భద్రపరిచే గదిని, సమస్యలు తలెత్తిన వాటిని వేరుగా భద్రపరచడం మరియు సిసి కెమరాల ద్వారా నిర్వహిస్తున్న వెబ్ కాస్టింగ్, అలారం, భద్రత సిబ్బంది, వ్యారికేటింగ్ తదితర విషయాలను పరిశీలించడంతో పాటు పలువిషయాలను గురించి జిల్లా కలెక్టర్, సిపి ల ద్వారా అడిగి  తెలుసుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎఫ్ ఎల్ సి లో పాల్గొనడం  బాగుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్,ఏ ఓ జగత్ సింగ్, వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ మోహనా చారి , సిపిఐ(ఎం) మేలుకూరి వాసుదేవ రెడ్డి, బీఎస్పీ గాలి అనిల్ కుమార్, బిఆర్ ఎస్  సత్తినేని శ్రీనివాస్ , టిడిపి ఈ రవీందర్ తదితరులు పాల్గోన్నారు.