కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న బిజెపి

కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న బిజెపి
  • కొనసాగుతున్న కాంగ్రెస్ మౌన దీక్ష
  • మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిజెపి కక్షపూరిత రాజకీయాలకు రాహుల్ గాంధీ జైలు శిక్ష ఉదంతమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సూరత్ కోర్టు  రాహుల్ గాంధీ 
కి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుకు నిరసనగా కరీంనగర్ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రేడ్ నాయకులు మౌనదీక్ష చేపట్టారు.

ఏఐసీసీ అగ్రనేత  రాహుల్ గాంధీ  2019 పార్లమెంట్ ఎన్నికల సభలో మోడీ గురించి చేసిన ఆరోపణల నేపథ్యంలో సూరత్ కోర్ట్ రాహుల్ గాంధీ కి  రెండేళ్ల జైల్ శిక్ష విధిస్తూ నిన్న ఇచ్చిన తీర్పును ఖండస్తూ కోతిరాంపూర్ గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష   చేపట్టారు. ఈ దీక్షలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ , నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు హాజరైనారు.