ప్రధాని మోడీ సభను విజయవంతం చేద్దాం

ప్రధాని మోడీ సభను విజయవంతం చేద్దాం
  • నూతన అధ్యక్షుడిపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దు
  • బీజేపీ మాజీ నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రంగల్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ మాజీ నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 చివరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ సభ ఎన్నికల శంఖరావం పూరించే సభగా ఉండబోతోందని వెల్లడించారు. బూత్ స్థాయి కార్యకర్త మొదలు పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, జాతీయవాదులందరు స్వచ్ఛందంగా తరలి వెళ్లాలని కోరారు. ఉదయం 10 గంటలకు సభ స్థలికి చేరుకోవాలని సూచించారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.  సహనంతో ఉండి పార్టీ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని సూచించారు. వ్యక్తులను కేంద్రంగా చేసుకొని పని చేస్తే వ్యక్తికే లాభం చేకూరుతుందే కానీ పార్టీకి లాభం చేకూరదనే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు.  నూతనంగా నియామకమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మెన్ ఈటల రాజేందర్ లకు కరీంనగర్ నియోజకవర్గం పక్షాన బేతి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి బ్రహ్మం, గుడిపాటి జితేందర్ రెడ్డి, వడ్డేపల్లి సుమన్, బలుసుల అనిల్, కందుకూరి వెంకటేష్, కంకటి సాగర్, రవీందర్, అవినాష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.