తై క్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుర్రం కృష్ణ

తై క్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుర్రం కృష్ణ

 ముద్ర ప్రతినిధి భువనగిరి : తెలంగాణ తైక్వాండో ఆసోసియేషన్ ఎన్నికలు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో శనివారం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాల్క కొమరయ్య ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుర్రం కృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల పరమేశం, ఏర్పుల శివప్రసాద్, టి మల్లేష్ గౌడ్, పి సుధాకర్, బాలయ్య, ప్రపుల్ రెడ్డి లు గుర్రం కృష్ణ అభినందించారు.