యాదగిరిగుట్ట మండలంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న వట్టిపల్లి...

యాదగిరిగుట్ట మండలంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న వట్టిపల్లి...

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్): బిజెపి జిల్లా. మండల కమిటీల ఆధ్వర్యంలో గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఈ యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి బిజెపి ప్రచార కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు మరియు రాజపేట మాజీ ఎంపీపీ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని ప్రతి గడపకు బిజెపి శ్రేణులు కరపత్రాలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరిన్ని సంక్షేమ పథకాలు చేపడతామని హామీ ఇచ్చారు. రానున్న శాసనసభ. పార్లమెంటు ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను ఆశీర్వదిస్తూ పువ్వు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర నాయకులు గుంటిపల్లి సత్యం. సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్. జిల్లా నాయకులు కాదూరి అచ్చయ్య. కిషన్ నాయక్. మండల నాయకులు శారజీ లక్ష్మయ్య. ప్రధాన కార్యదర్శులు నేరెళ్ల సంతోష్. కర్రె శ్రీకాంత్. పుల్లె నరేష్. ఆరే జంగయ్య. ఏలూరి సత్యనారాయణ. గౌరాయపల్లి గ్రామ శాఖ బిజెపి అధ్యక్షులు పోశెట్టి. బరిగే యాకూబ్. విక్రమ్. గుజ్జ శేఖర్. కటకం బాలరాజ్. విజయ్ రాజ్. పోశెట్టి కుమార్. రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.....