సూర్యాపేటలో ఉద్రిక్తత....

  • కౌన్సిలర్ ల మధ్య తలెత్తిన ఘర్షణ.
  • కొద్దిరోజులుగా మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాస రగడ.
  • పోలీసుల రంగ ప్రవేశం తో చక్కబడ్డ పరిస్థితులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసానికి అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన కౌన్సిలర్ మధ్యన ఆదివారం మధ్యాహ్నం పరస్పర దాడులు తోపులాట జరగడంతో సూర్యాపేటలో తీవ్ర ఉద్విక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డుసభ్యులకు గాను అవిశ్వాసానికి మద్దతుగా 32 మంది కౌన్సిలర్ లు సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానాన్ని కావాలని కలెక్టర్కు మెమోరన్నో సమర్పించారు ఈనెల 27న శనివారం అవిశ్వాస తీర్మానం జరిగింది. అయితే అవిశ్వాస తీర్మాన కాపిలో పేరున్న 45వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ సమావేశానికి ముందు జంప్ కావడంతో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు ఎవరూ కూడా హాజరు కాకపోవడంతో సాయంత్రం వరకు సమయం ఇచ్చిన కలెక్టర్ అవిశ్వాసం వీ గిపోయిందని ప్రకటించారు.

అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన 32 మంది కౌన్సిలర్లు లలో ఒక కౌన్సిలర్ అవిశ్వాసానికి రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం దిగిపోయింది దీంతో నేరుగా బాలాజీ గార్డెన్ కు చేరుకున్న 31 మంది కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించి తమతో కలిసి రాని గండూరి పావని కృపాకర్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతాడని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.


సమయానికి హ్యాండ్ ఇవ్వడంతో ఆదివారం గండూరి పావని ఇంటి ముందు మిగితా కౌన్సిలర్ ల ధర్నా నిర్వహించారు. కోడిగుడ్లు విసిరడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో ఈలోపుగా చైర్పర్సన్ అనుకూల బీ ఆర్ఎస్ వర్గాలు కూడా గండూరి పావని కృపాకర్ కు మద్దతుగా అక్కడికి చేరుకోవడంతో తోపులాటలు జరిగాయి.


పరస్పరం కౌన్సిలర్లు దాడి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులు చక్కదిద్ది ఇరువర్గాలను చెదరగొట్టారు
ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో బారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరిన్ని జరగకుండా బందోబస్తు చేపట్టారు.