కాంగ్రెస్​ వైపు ‘ఇండియా టుడే’ మొగ్గు

కాంగ్రెస్​ వైపు ‘ఇండియా టుడే’ మొగ్గు
  • 63 –73 స్థానాలు వస్తాయని వెల్లడి
  • బీఆర్ఎస్​కు 34  నుంచి 44 స్థానాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వెల్లడించింది. ఈ సంస్థ కాంగ్రెస్ కు 63 నుంచి 73 వరకు స్థానాలు వస్తాయని వెల్లడించింది. కాగా అధికార బీఆర్ఎస్ కు 34 నుంచి 44 సీట్లు వస్తాయని, బీజేపీకి 4 నుంచి 8 స్థానాలు పేర్కొంది. ఇతరులు 5 నుంచి ఎనిమిది స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఇండియా టుడే సంస్థ ఈ సర్వేను వెల్లడించడం విశేషం. గతంలో ఈ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా వాస్తవానికి దగ్గరగా ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.