అగ్ని ప్రమాదానికి గురైన బాధిత  కుటుంబాన్ని పరామర్శించి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఈశ్వరి బాయి, పూర్ణ చందర్ నాయక్

అగ్ని ప్రమాదానికి గురైన బాధిత  కుటుంబాన్ని పరామర్శించి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఈశ్వరి బాయి, పూర్ణ చందర్ నాయక్

ముద్ర ఆదిలాబాద్, ఇంద్రవెల్లి మండలం లోని ధనోర బి గ్రామానికి చెందిన  ఆత్రం తిరుపతి గారి  ఇల్లు గత 2 రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమవ్వగా  విషయం తెలుసుకున్న *తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ డైరెక్టర్ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు బాధవత్ పూర్ణ చందర్ నాయక్    ఆత్రం తిరుపతి  గారింటికెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా దగ్ద మైన ఇంటిని పరిశీలించారు.

కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని   ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.11 కెవి విద్యుత్ తీగలకు సంబంధించి విద్యుత్ అధికారులతో మాట్లాడరు.ఇళ్లపై ఉన్నటువంటి విద్యుత్ లైన్ మార్చాలని  పూర్ణ చందర్ నాయక్ అధికారులకు విన్నవించారు.అనంతరం  బియ్యం పప్పు నూనె చక్కెర తదితర నిత్యావసర సరుకులు అందజేశారు.కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  రాథోడ్ మోహన్ నాయక్ ఐటిడిఎ డైరెక్టర్ మరసుకొల బాపురావ్ ,  బి ర్ స్ నాయకులు షేండిగే సతీష్ ,రవి  బాబా శ్యాం టైగర్  తోటి సంఘం నాయకులు కాత్లే మారుతి  తదితరులు పాల్గొన్నారు