ఎల్ఓసి చెక్కు అందజేత

ఎల్ఓసి చెక్కు అందజేత

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దంతూరు గ్రామానికి చెందిన బోదాసు యాదయ్యకు ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 80,000 రూపాయల ఎల్ఓసి చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోటి కుమార్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి బోదాసు చిన్న ఈదయ్య,గ్రామ శాఖ అధ్యక్షుడు గోరుగంటి రవీందర్,పల్లెర్ల పాండు, పల్లెర్ల వెంకటేష్,మాకోలు శ్రీను, జమ్ము శ్రీశైలం ,గోరుగంటి సాయి తదితరులు పాల్గొన్నారు.