జహంగీర్ ను పార్లమెంటుకు పంపించాలి..

జహంగీర్ ను పార్లమెంటుకు పంపించాలి..

ఆలేరు, ముద్ర : భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని పట్టణాలు, మండలాల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న సిపిఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ, ప్రజలను మోసం చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతూ కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టిస్తూ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బిజెపిని ఓడించి రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూకంటి పౌలు, పిక్క గణేష్, బుగ్గ నవీన్, నల్లమాస తులసయ్య, సంగి రాజు పాల్గొన్నారు.