కేసముద్రం @43 డిగ్రీల ఉష్ణోగ్రత 

కేసముద్రం @43 డిగ్రీల ఉష్ణోగ్రత 

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదయ్యింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పోలిస్తే కేసముద్రంలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం విశేషం. సోమవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ లో 42, వరంగల్ లో 42, రామగుండంలో 41, వేములవాడలో 41, హైదరాబాదులో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయ్యింది. సోమవారం మధ్యాహ్నం ఎండ మండిపోవడంతో జనం బయటకు రావడానికి బీతిల్లారు. దీనితో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి.