రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ లో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ లో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది

 రేవంత్ రెడ్డి ప్రచారంతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ గా రేవంత్ రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ నేత బుడిగే సతీష్ గౌడ్ గూడూరు ఏప్రిల్ 21 (ముద్ర): తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా మారుతుందని రానున్న కర్ణాటక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని గూడూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడుగు సతీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాదులోని రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కర్ణాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం స్టార్ క్యాంపెనర్ గా నియమించడం పట్ల చాలా సంతోషంగా ఉందని బుడిగే సతీష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రచారం తో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ అన్నారు. మీ తోడ్పాటు కర్ణాటక ప్రజలకు ఎంత అవసరమని తెలియజేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని అధికార పార్టీ చేస్తున్న మోసాలను లీకేజీలను ప్రజలు గమనిస్తున్నారని నిరుద్యోగ యువత కోసం రేవంతన్న చేపట్టి నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థులు రైతులు మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.