సర్వతోముఖాభివృద్ధి కోసం బిజెపిని గెలిపించండి

సర్వతోముఖాభివృద్ధి కోసం బిజెపిని గెలిపించండి

నార్సింగిలో కొండా సంగీతా రెడ్డి ప్రచారం

ముద్ర, రాజేంద్రనగర్: చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండ సంగీత రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం లో పర్యటించారు. ముందుగా నార్సింగ్ లోని మై హోమ్ అవతార్, విజిలింగ్ వుడ్స్ గేటెడ్ కమ్యూనిటీల సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సారథ్యంలో భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. నరేంద్ర మోడీ తన సంక్షేమ విధాన విధానాలతో దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధిని సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపై ఉందన్నారు కొండ సంగీతారెడ్డి. దేశ ప్రజల కోసం పదేళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన నరేంద్ర మోడీ రానున్న రోజుల్లో గొప్ప ప్రయత్నాల ద్వారా దేశాన్ని అన్ని రంగాల్లో నడిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అందుకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ తను ఎందుకురా మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు. నగర ప్రాంతంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి కొండా సంగీత రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు పోలింగ్ లేని హాలిడేగా చూడొద్దని, దేశ తలరాతను మార్చే కీలకమైన సందర్భంగా భావించాలని ఆమె కోరారు. తన భర్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం అందరూ సహకరించాలని ఆమె కోరారు. అనంతరం గండిపేటలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లోనూ కొండా సంగీత రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ తన మీద ఫోటో దేశ ప్రజలందరికీ కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా సమాన హక్కులను అందించారని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే ఇవాళ దేశంలోని ప్రజలంతా స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.