అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు...

అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు...

ముద్ర,హైదరాబాద్:- సికింద్రాబాద్  మారేడ్‌పల్లిలో   ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గత ఏడాది  లాస్య నందిత తండ్రి సాయన్న అంత్యక్రియలను మారేడ్‌పల్లిలో నిర్వహించారు.సాయన్న  సమాధి వద్దే  లాస్య నందిత అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

సికింద్రాబాద్  గాంధీ ఆసుపత్రిలో లాస్య నందిత  మృతదేహనికి  పోస్టుమార్టం నిర్వహించారు.పోస్టుమార్టం పూర్తైన తర్వాత లాస్యనందిత మృతదేహన్ని  ఆమె స్వగృహనికి తరలించారు. లాస్య నందిత మృతదేహనికి  అధికార లాంఛనాలతో  అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు.