భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి సేవలు మరువలేనివి  - ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి సేవలు మరువలేనివి  - ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి సేవలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. వాజపేయి జయంతి సందర్బంగా నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత భవనంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన  మాట్లాడుతూ భారతదేశ చరిత్ర లో వాజ్ పేయి సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. దేశ అభివృద్ధిలో వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. వాజ్ పేయి స్ఫూర్తి తో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజుకుమార్ రెడ్డి, నాగచారి, అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, మల్లికార్జున్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, అలివేలు మంగ, రాజేందర్ తో పాటు విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.