ప్రజాపాలనకు శ్రీకారం

ప్రజాపాలనకు శ్రీకారం
  • ఎల్లాపూర్ లో ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్, కలెక్టర్ రాజర్షి షా
  • దరఖాస్తుల స్వీకరణ, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో ప్రజాపాలన సభలకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం పాపన్నపేట మండలం ఎల్లాపూర్ లో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా లంచానంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కల్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అధ్యక్షులు పుల్లన్నగారి చందన ప్రశాంత్ రెడ్డి, ప్రత్యేక అధికారి జయరాజు, స్థానిక సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ అజయ్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.