అంబేద్కర్ కూ నివాళులు
ముద్ర ప్రతినిధి, మెదక్:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యం. గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శ ప్రాయమన్నారు. ప్రపంచం గర్వించదగిన ప్రముఖులలో ముఖ్యుడు మన అంబేద్కర్ అని,భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థలకు రూపకల్పన చేసి మన దేశాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు జయరాజ్, శమీ, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్, నాయకులు రాగి అశోక్, మోచి కిషన్, మోహన్, జుబేర్, ఫాజిల్, ప్రసాద్, కాసాపురం కిరణ్, మహేష్, సాయిబాబా, రాజు, లక్ష్మణ్, భువనచంద్ర తదితరులు పాల్గొన్నారు.
దివంగత జెడ్పి ఛైర్మెన్ సంపత్ రెడ్డికి నివాళులు...
బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పక్షాన సంతాపాన్ని వ్యక్తం చేశారు.