అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మల్యాల వాసి

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మల్యాల వాసి

ముద్ర, మల్యాల: రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ( మైక్రో బయాలజీ ) లో మల్యాలకు చెందిన డాక్టర్ నెల్ల హర్షిణి నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర్వులు అందజేశారు. మల్యాల మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు నెల్ల అరుణరాజేశ్వర్రెడ్డి కూతురైన హర్షిణి గతంలో మల్యాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. హర్షిణి నియామకం పట్ల పలువురు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.