మంథని మున్సిపల్ కమిషనర్ గా బాలకృష్ణ నియమకం...

మంథని మున్సిపల్ కమిషనర్ గా బాలకృష్ణ నియమకం...
  • ప్రస్తుత కమిషనర్ సతీష్ ఐదు నెలల్లోనే బదిలీ...

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని మున్సిపల్ కమిషనర్ గా బాలకృష్ణ నియమకం అయ్యారు.  ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన సతీష్ కేవలం ఐదు నెలల్లోనే మాత్రమే కొనసాగారు. సతీష్ సూర్యాపేట జిల్లాలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ  మున్సిపల్ కమిషనర్ గా మంథనికి బదిలీ అయ్యారు. 


ఆయన స్థానంలో నూతన కమిషనర్ గా ఎన్. బాలకృష్ణ ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం బాలకృష్ణ రంగారెడ్డి జిల్లా మెప్మా పీడీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి బాలకృష్ణ ను మంథని మున్సిపల్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.