రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు...

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు...
ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:-ఇటివల కారు ప్రమాదంలో గాయపడి.. హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గురువారం మంత్రి శ్రీధర్ బాబు  కలిసి పరామర్శించారు. అలాగే వైద్యులతో మాట్లాడి,  లక్ష్మణ్  ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు ధైర్యంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు  కోరారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితం లోకి రావాలని మంత్రి శ్రీధర్ బాబు  ఆకాంక్షించారు.