బీజేపీ లో భారీ చేరికలు

బీజేపీ లో భారీ చేరికలు

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: శంకరపట్నం మండలానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజాపాష, యువజన సంఘాల నాయకులు ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బిజెపిలో చేరిన వారిలో ఖాజాపాష, తెలంగాణ ఉద్యమకారుడు రాసమల్ల శ్రీనివాస్, అర్కండ్ల, కేశవపట్నం మాజి ఉప సర్పంచులు చెర్ల శ్రీనివాస్, బొంగోని కుమార్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కనుకుంట్ల శ్రీనివాస్, యువజన నాయకులు, పంజాల అనీల్ గౌడ్, కునారపు శ్రీనాథ్, బైరి రాజు, బొంతల రవి, మెడిశెట్టి రాజేష్, గుర్రం పవన్, రాసమల్ల సుధాకర్, రాసమల్ల రాజు, జూపల్లి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు, ఎంపిటీసి ఎనుగుల అనీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దండు కొమురయ్య, సీనియర్ నాయకులు దొంగల రాములు, మండల ప్రధాన కార్యదర్శి కొయ్యడ అశోక్ తదితరులు పాల్గొన్నారు.