మెదక్ బిజెపి అభ్యర్థి పంజా ప్రచారానికి శ్రీకారం

మెదక్ బిజెపి అభ్యర్థి పంజా ప్రచారానికి శ్రీకారం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ బిజెపి అభ్యర్థి పంజా విజయ్ కుమార్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందరి మాదిరిగానే ఆనవాయితీగా సోమవారం నిజాంపేట మండలం రాంపూర్ లో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శివునికి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

నీళ్లు, నిధులు, నియామకల కోసం తెలంగాణ రాష్ట్రo ఏర్పాటు చేసుకుంటేనీళ్ల కోసం నిర్మించిన ప్రాజెక్టులు కుంగిపోయాయన్నారు. అదేవిధంగా ఉద్యోగాలు వేచి చూసి ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నాయకులు రాజశేఖర్, నందారెడ్డి, నల్లాల విజయ్ కుమార్, మధు, వీణ తదితరులు పాల్గొన్నారు.