క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్... అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్... అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

ముద్ర,హైదరాబాద్:-ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్న వారికి శుభవార్త.ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ మెట్రో రైలు సమయాలను పొడిగించనున్నారు.అర్ధరాత్రి 12:15 గంటల వరకు మెట్రో సేవలు కొనసాగుతాయని తెలిపారు. తెల్లవారుజామున 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జిఆర్‌ఐ స్టేషన్లలో నిర్ణీత గంటల తర్వాత మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంది. ఇతర స్టేషన్లలో మాత్రమే ఎగ్జిట్‌లు అందుబాటులో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.