రేపు మంథనిలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన

రేపు మంథనిలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శనివారం మంథనిలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రామగిరి మండలం కల్వచర్ల గ్రామపంచాయతీ ప్రారంభోత్సవం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9:30 నిమిషాలకు  మంథని టౌన్ లో గంగాపురి వద్ద నూతనంగా నిర్మించిన ఎస్ఆర్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మంథని టౌన్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులతో నియోజకవర్గ సమస్యలపై రివ్యూ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు  మంథని మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ, కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంటకు కొయ్యూరు నుండి కాటారం మరియు మహాదేవపూర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీలలో పాల్గొంటారు.