శూనకానికి అంత్యక్రియలు 

శూనకానికి అంత్యక్రియలు 
ముద్ర ప్రతినిధి, మెదక్:విశ్వాసానికి మారు పేరుగా నిలిచే గ్రామ సింహం(శునకం) ఆకస్మిక మరణం పొందగా కాలనీ వాసులు నివాళులర్పించి అంతక్రియలు నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఎన్ డి వై కాలనీకి చెందిన తోడంగుల మాణిక్యం ఇంటి పెంపుడు కుక్క (బల్లు) గత 12 ఏళ్లుగా వాళ్ళతోనే ఉంది. కేవలం ఒక ఇంటికే కాకుండా కాలనీ మొత్తానికి దైర్యంగా ఉండేది. కాలనీ వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందింది. కాలనీ వాసులు అంత్యక్రియలు నిర్వహించారు.