చేవెళ్ల పార్లమెంట్ LDM కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా డాక్టర్ కేతూరి వెంకటేష్
ముద్ర,పానుగల్:- చేవెళ్ల పార్లమెంట్ LDM కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పానుగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ కేతూరి వెంకటేష్ నియమితులయ్యారు.కేతూరి వెంకటేశ్ ప్రస్తుతం ఎఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ గా ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నా వంతుగా కృషి చేస్తానని అదేవిధంగా నాపై నమ్మకం వుంచి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ జాతీయ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గార్కి, రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారికి,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షి గారికి, ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ ) కొప్పుల రాజు గారికి,ఏఐసీసీ ఓబిసి చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టి.పి.సి.సి ప్రెసిడెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి మరియు తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి తదితరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.